ఆ హీరోలతో సినిమాలు చేయనంటున్న రష్మిక..!
by సూర్య |
Tue, Mar 31, 2020, 11:50 AM
కన్నడ భామ రష్మికకు ఇప్పుడు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మహేష్ బాబు సినిమా తర్వాత రష్మిక నటించిన 'భీష్మ' సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో చాలామంది దర్శక నిర్మాతలు రష్మిక డేట్స్ తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.రష్మిక స్టార్ డంని ఉపయోగించుకోవాలని కుర్ర హీరోలు సైతం ఎదురుచూస్తున్నారట. అయితే రష్మిక చిన్న సినిమాలకి సైన్ చేయడం ఇష్టంలేక.. తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్టుగా వార్త వినిపిస్తోంది. అంతేకాక స్టార్ డమ్ లేని హీరోలకి సంబంధించిన సినిమాలను ఒప్పుకోవద్దని తన మేనేజర్ తో చెప్పిందని అంటున్నారు. రష్మిక ప్రస్తుతం చిన్న హీరోలతో నటించకుండా పెద్ద హీరోలతో నటించి తన స్టార్ డం ను మరింత పెంచుకోవాలని ఆలోచిస్తుంది.
Latest News