by సూర్య | Tue, Mar 31, 2020, 11:39 AM
శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు.. సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. దీంతో వారిని ఆదుకోవడం కోసం సినీ ఇండస్ట్రీ కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రూ. 75 వేలు ఆర్ధిక సాయం అందించారు. మరోవైపు ఆయన కుమారుడు పిట్టకథ ఫేమ్ సంజయ్..రూ.25 వేలు సాయం అందించారు. మొత్తానికి పెద్ద హీరోల స్థాయిలో కాకపోయినా.. ఉన్నంతలో కరోనా బాధితుల కోసం రూ. 1లక్ష వరకు సాయం ప్రకటించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
Latest News