సినీ హీరో నారా రోహిత్ రూ.30 లక్షల విరాళం

by సూర్య | Tue, Mar 31, 2020, 10:40 AM

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై జరుపుతున్న పోరాటానికి సినీ నటుడు నారా రోహిత్ మద్దతు ప్రకటించాడు. తన వంతుగా భారీ విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి,  రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.30 లక్షలు విరాళంగా ఇస్తానని తెలిపాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పది లక్షల రూపాయల చొప్పున ప్రకటించాడు. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ‘కరోనా’ ను అరికట్టవచ్చని ప్రజలకు పిలుపు నిచ్చాడు. సినీ హీరో సందీప్ కిషన్ రూ.3 లక్షల విరాళంటాలీవుడ్ కి చెందిన మరో నటుడు సందీప్ కిషన్ కూడా రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించాడు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి ఈ విరాళం ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో తన సొంత రెస్టారెంట్ 'వివాహ భోజనంబు'లో పని చేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగుల బాధ్యతలను తాను చూసుకుంటానని చెప్పాడు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM