by సూర్య | Mon, Mar 30, 2020, 02:38 PM
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం రోజు వారీ కూలీలపై, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేసే రోజు వారీ కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఫండ్ కు విరాళాలు వచ్చి చేరుతున్నాయి. ప్రముఖ హీరో ప్రభాస్ తన విరాళంగా రూ.50 లక్షలు ప్రకటించాడు. ‘కరోనా’పైమ పోరాటానికి గాను పీఎం రిలీఫ్ ఫండ్ కు, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రభాస్ ఇప్పటికే ప్రకటించాడు. టాలీవుడ్ కు చెందిన మరో నటుడు బ్రహ్మాజీ కూడా సీసీసీకి రూ.75 వేలు విరాళంగా ప్రకటించాడు.
Latest News