కథ చెప్పిన కలెక్షన్ కింగ్
by సూర్య |
Mon, Mar 30, 2020, 01:53 PM
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ పలువురు వీడియోలు విడుదల చేశారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కరోనా మహమ్మారిపై వీడియో రూపంలో అవగాహన కల్పించారు.పెద్దల మాటలు గౌరవించకపోతే ఏం జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను అని వీడియో మొదలు పెట్టారు మోహన్ బాబు. రామాయణంలో వాలి సుగ్రీవులు మొదట యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోతాడు. యుద్ధంలో ఓడిపోయిన కొద్దిసేపటి మరలా వాలి ముందుకు వచ్చి యుద్దానికి రమ్మని రెచ్చగొడుతుంటాడు. దాన్ని చూసి వాలి భార్య ఇప్పుడే యుద్ధంలో ఓడిపోయిన వాడు మరలా వచ్చాడంటే ఏదో బలం సుగ్రీవుని వెనుక ఉండే ఉంటుంది. యుద్దానికి వెళ్ళొదంటుంది. అయినా లెక్కచేయకుండా వెళ్లిన వాలి రాముని బాణానికి ప్రాణాలు వదులుతాడు.
లక్ష్మణుడు గీత దాటొద్దని సీతకు చెప్పి అన్న రాముని కోసం బయలుదేరతాడు. లక్ష్మణుడి మాట వినకుండా గీత దాటడంతో.. అది యుద్దానికి దారితీస్తుంది. పెద్దలు చెప్పిన మాటలు వినకపోవడంతో సీత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఇప్పుడు పెద్దవారు మోదీ చెప్పినట్లుగా లాక్ డౌన్ ని పాటించి ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఉందాం. అలా కాకుండా మోదీ మాటలు లెక్కచేయకుండా బయటకు వెళ్తే వాలీ, సీతాదేవికిల వలే మనమూ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియో రూపంలో తెలిపారు మోహన్ బాబు.
Latest News