కరోనా పై చిరు, నాగ్ ల పాట!

by సూర్య | Mon, Mar 30, 2020, 12:31 PM

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జున, యువ కథానాయకులు వరుణ్‌తేజ్, సాయితేజ్‌లు కలిసి పాటందుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరపరిచి పాడిన పాటకు వీరంతా అభినయించారు. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు నటులందరూ ముందుకొచ్చారు.తమవంతు సాయం ప్రకటిస్తూ తమలోని దాతృత్వ గుణాన్ని చాటుతున్నారు. చిరంజీవి సారథ్యంలో ఇటీవల కరోనా క్రైసిస్ చారిటీ పేరిట ఓ సంస్థ ఏర్పడింది. పలువురు నటీనటులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరిస్తూ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, చిరంజీవి, నాగార్జున, వరణ్‌తేజ్, సాయితేజ్, కోటి అభినయించిన ఈ పాటకు విపరీతమైన స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM