నర్సుగా మారిన బాలీవుడ్ నటి

by సూర్య | Mon, Mar 30, 2020, 12:11 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ఫైట్ చేసేందుకు నర్సుగా మారింది బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా. 2016లో షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన 'ఫ్యాన్' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. కరోనా భారినపడిన వారిని కాపాడేందుకు గాను ఆమె ముంబై ఆసుపత్రిలో నర్సుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తుంది.నటి కాకముందు శిఖా.. వర్ధమాన్ మహవీర్ మెడికల్ కాలేజ్ మరియు సఫ్ధర్జంగ్ హాస్పిటల్‌, న్యూ ఢిల్లీలో నర్సింగ్ చేసింది. కరోనా వైరస్ ను అంతం చేయడానికి పోరాటంలో తానూ పాల్గొంటున్నానని.. దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటానని ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో శిఖా తెలిపింది. శిఖా మల్హోత్రా చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM