by సూర్య | Mon, Mar 30, 2020, 11:15 AM
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెండవ సారి సినిమా రూపొందుతుంది. వీరిరువురి కాంబినేషన్ లో విడుదలయిన 'అరవింద సమేత' సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. 'అల వైకుంఠపురములో' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తీస్తున్న సినిమా ఇదే.. అంతేకాక 'ఆర్.ఆర్.ఆర్' లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు టాక్. ఇక రెండవ హీరోయిన్ గా త్రివిక్రమ్ కు అచ్చొచ్చిన పూజ హెగ్డేను తీసుకోవడానికి సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Latest News