రూ.15 ల‌క్ష‌ల విరాళం ఇస్తున్నట్లు శర్వానంద్ ట్విట్టర్ ద్వారా ప్రకటన

by సూర్య | Sun, Mar 29, 2020, 02:38 PM

మొన్న చిరంజీవి, నిన్న రామ్‌ చరణ్‌.. నేడు శర్వానంద్‌ ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి ట్వీట్‌ ద్వారా శర్వానంద్‌ సాయాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఫేస్‌బుక్‌లో మాత్ర‌మే పోస్టులు చేస్తోన్న శర్వానంద్‌ ఇప్పుడు ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చి..  దిన‌స‌రి కార్మికుల‌కి అండ‌గా నిలిచేందుకు రూ.15 ల‌క్ష‌ల విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు.కరోనా విజృంభిస్తోన్న స‌మయంలో అంద‌రం క‌లిసి ప‌నిచేద్దామని పిలుపునిచ్చాడు. క‌రోనాని ఎదుర్కొందామని, ప్ర‌భుత్వం చెబుతున్న స‌ల‌హాలు, సూచ‌నలు త‌ప్ప‌క పాటిద్దామని అన్నారు. తాను నటించిన మహాను భావుడు సినిమాలో ఓసీడీ ఉన్న పాత్రలో తాను ప్రవర్తించినట్లుగానే ఇప్పుడు ప్రజలు ప్రవర్తించాలని చెప్పాడు. ఇప్పటికే సినీ నటులు కరోనాను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM