by సూర్య | Sun, Mar 29, 2020, 12:48 PM
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రంగా ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరక్కించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలిపాడు. ప్రశాంత్ వర్మ అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా పెద్దగా అలరించలేదు. కాగా ఆయన ప్రస్తుతం కరోనా వైరస్ పై సినిమా తీయడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం కరోనా వల్ల ఎర్పడిన పరిస్థితులను ఈ సినిమాలో చర్చించనున్నారట. కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది. దీని ప్రభావం దేశాలపై మరియు ప్రజలపై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించనున్నాడట. కాగా కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలకు గురౌతున్నారు. కరోనా దెబ్బతో అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ కూడా కుంటుపడింది. దీంతో తెలుగు సినిమాల షూటింగ్స్ పూర్తిగా రద్దయ్యాయి. అంతేకాదు విడుదల కావాల్సిన చాలా సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.
Latest News