by సూర్య | Fri, Jan 24, 2020, 06:11 PM
తమిళ సినీ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి వారైన సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ మరోసారి ఒక సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నట్టు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సంక్రాంతికి రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో పలకరించాడు.ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా రజినీకాంత్.. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది..
Latest News