by సూర్య | Fri, Jan 24, 2020, 05:20 PM
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో హీరోయిన్ అనుష్క చేస్తున్న కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’ రూపొందుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి జనవరి 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 20 న విడుదల కానుంది అని సమాచారం. ఈ సినిమా వాయిదాకు కారణం ఇంకా తెలియలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో మాధవన్, అంజలి, షాలిని పాండేలతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మాడిసెన్ కూడా నటించారు.
Latest News