by సూర్య | Fri, Jan 17, 2020, 01:15 PM
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రం నుంచి రోజుకొక వార్త సంచలనాలను రేకెత్తిస్తున్నాయి . ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. అయితే ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ .. చరణ్ తదితరులపై భారీస్థాయిలో క్లైమాక్స్ ను డిజైన్ చేశారట. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో వుంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ జోడీగా అలియా భట్. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను జులై 30వ తేదీన విడుదల చేయనున్నారు.
Latest News