by సూర్య | Fri, Jan 17, 2020, 12:52 PM
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం 'డిస్కోరాజా' . రవితేజ ఈ చిత్రంలో విలన్ గా మారతానని అంటున్నారు.నభా నటేష్ హీరోయిన్. బాబీసింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రవితేజ.. సినిమా, పర్సనల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. గతంలో నేను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడే వాడిని, అందుకే కిక్, విక్రమార్కుడు వంటి చిత్రాలలో నటించి, సూపర్ హిట్స్ అందుకున్నాను. అదే సమయంలో నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించాను. ఇప్పుడు సినిమాలో కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ లేకపోతే చూడటం లేదు. పాత్ర భిన్నంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికైనా నేను సిద్ధం అన్నారు.
Latest News