పూజా క్రేజ్ రెట్టింపైందా ?

by సూర్య | Fri, Jan 17, 2020, 12:31 PM

పూజా హెగ్డే నుండి ఈ  సంవత్సరంలో వచ్చిన మొదటి చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గర్లో ఉన్న ఈ చిత్రం ఓవర్సీస్లో సైతం భారీ కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ విజయంతో ఇప్పటికే స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్న పూజా రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రేక్షకుల్లో.. మరీ ముఖ్యంగా యువతలో పూజా క్రేజ్ రెట్టింపైందనే అనాలి. ఈ విజయంతో ఇకపై ఆమె పనిచేసే సినిమాలకు ఆమె కూడా క్రౌడ్ పుల్లర్ గా మారుతుందనడంలో సందేహమే లేదు. ఈ విజయాన్ని పూజా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ విజయం ఆమెకు మరిన్ని పెద్ద సినిమా ఆఫర్లను అందించడం ఖాయం. ఇకపోతే ప్రస్తుతం ఆమె ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘జాన్’ చిత్రంలో నటిస్తోంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM