by సూర్య | Fri, Jan 17, 2020, 12:26 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ 11న విడుదలైంది. అయితే లేడీ అమితాబ్ విజయ శాంతి పదమూడేళ్ల లాంగ్ బ్రేక్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు . మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె కథలో కీలకమైన భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ పాత్ర చేశారు. ఆ పాత్రలో తన మార్కు పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకున్నారు. కాగా ఈ చిత్రం కొరకు విజయశాంతి తీసుకున్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హీరోయిన్ రష్మిక కంటే కూడా తన రెమ్యూనరేషన్ ఎక్కువట. ఈ విషయాన్ని విజయం శాంతి స్వయంగా చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూ లో విజయశాంతి ని సరిలేరు నీకెవ్వరు కోసం మీ రెమ్యూనరేషన్ ఎంతని అడుగగా.. మహేష్ తరువాత ఎక్కువ రెమ్యూనరేషన్ నాదే అన్నారు. అంటే ఆమె పరోక్షంగా హీరోయిన్ రష్మిక కంటే తానే ఎక్కువ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి చూస్తే విజయ శాంతి ఈ చిత్రం కొరకు 1.5 కోట్ల కు పైగా అందుకొని ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది.
Latest News