by సూర్య | Thu, Jan 16, 2020, 07:27 PM
స్టార్ హీరోయిన్ నయనతార ఎన్ని సినిమాల్లో నటించినా వాటి ప్రమోషన్స్ కి మాత్రం చాలా దూరంగా ఉంటుంది. చివరకు రజినీకాంత్ లాంటి స్టార్ హీరో నటించిన ‘దర్బార్’ సినిమాకు ప్రమోషన్స్కు అటెండ్ కాలేదు. నయనతార ఒక సినిమా ఒప్పుకున్నపుడే ప్రమోషన్స్కు రానని నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇక ఎప్పుడూ తను యాక్ట్ చేసిన సినిమాల గురించి బయట ఒక్క మాట కూడా మాట్లాడి ప్రమోట్ చేయని ఏకైక హీరోయిన్గా నయనతార వార్తల్లో నిలిచింది. అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన అవార్డు వేడుకలో నయనతార పాల్గొనడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డులు తీసుకోవడానికి వస్తావు కానీ ప్రమోషన్స్ కు రావా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోలివుడ్ దర్శక నిర్మాతలు. ఏదైనా సినిమా అవార్డులకు మాత్రమే కాదు.. సినిమాను నిలబెట్టే ప్రమోషన్స్లో నయనతార పాల్గొంటే బాగుంటుందన్నారు. ఇకనైనా నయన్ తన పద్ధతి మార్చుకుంటే మంచిదని మాట్లాడుకుంటున్నారు కొంతమంది దర్శక నిర్మాతలు. అయితే గతంలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఎవరికీ పెద్దగా తెలియడం ఇష్టం లేదని చెప్పింది నయన్ . ఇది మాత్రమే కాకుండా తన మాటలని మీడియా చాలా సార్లు తప్పుగా ప్రచారం చేసిందన్నారు. తన మాటల వెనుక ఉన్న ఇంటెన్షన్ ని మార్చి చూపించారని అందుకే తాను మీడియాకి దూరంగా ఉంటానని చెప్పింది. మొత్తానికి తనమీద వస్తున్న విమర్శలకు నయన్ ఎలా సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.
Latest News