by సూర్య | Thu, Jan 16, 2020, 03:05 PM
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ హాఫ్ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్స్ సూపర్బ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ డే వాల్డ్ వైడ్గా ’అల వైకుంఠపురములో’ దాదాపు రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .రెండో రోజు కూడా ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా సెకండ్ డే ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ.10.25 కోట్లను రాబట్టింది. మూడో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండగ రోజున అందరి అంచనాలను మించి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12 కోట్ల వరకు వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాల బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా మూడు రోజు కంటే సంక్రాంతి రోజున ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్కు బన్ని యాక్టింగ్ తోడై ఈ సినిమా పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. మొత్తంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లో ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ. 57 కోట్ల షేర్ రాబడితే.. ఓవర్సీస్ కర్ణాటక, రెస్ట్ ఆప్ ఇండియా కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల షేర్ కొల్లగొట్టింది. మొత్తంగా చూసుకుంటే ఓవర్సీస్లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మేనియా చాలా స్పష్టంగా కనబడుతోంది. మొత్తంగా రూ.85 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లో రూ. 73కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. మొత్తంగా మరో రూ. 11 కోట్లు వసూళ్లు సాధిస్తేకానీ బ్రేక్ ఈవెన్ కాదు.
Latest News