by సూర్య | Thu, Jan 16, 2020, 12:42 PM
బన్నీ తన తదుపరి చిత్రం స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ కూడా సుకుమార్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ లో బన్నీ పాల్గొనలేదు. బన్ని ప్రస్తుతం 'అలా వైకుంఠపురంలో' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా అల వైకుంఠపురంలో నిలిచిపోనుంది. ఐతే సుకుమార్ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల మొదటివారం నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ నందు బన్నీ కూడా పాల్గొంటారట. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, సుకుమార్ టీమ్ పూర్తి చేసింది. బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా డి గ్లామర్ రోల్ చేస్తున్నారని వినికిడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.
Latest News