by సూర్య | Thu, Jan 16, 2020, 12:26 PM
ఎట్టకేలకు రేపు ప్రభాస్ జాన్ మూవీపై స్పష్టత రానుంది. దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది స్టోరీ యూరప్ నేపథ్యంలో నడుస్తుంది. 1960 ల కాలం నాటి ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. సాహో చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ తన మూవీ గురించిన అప్డేట్ ఇవ్వనున్నారు. సంక్రాంతి పండుగను పొడిగిస్తూ ఆయన రేపు తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ ఇవ్వనున్నారు. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ జాన్ మూవీపై అప్డేట్ ఇవ్వాలంటూ ఆయనను కోరుతున్నారు. ఐతే ప్రభాస్ టీమ్ నుండి జాన్ మూవీ గురించి అసలు ఎటువంటి అధికారిక పోస్టర్స్ గాని, న్యూస్ గాని బయటకు రావడం లేదు. జాన్ అనే టైటిల్ కూడా కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే.
Latest News