by సూర్య | Thu, Jan 16, 2020, 12:11 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే 125 రోజుల పడిన కష్టం ఒకే ఒక దెబ్బతో మరచిపోయేలా చేసింది సరిలేరు టాక్. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగను ముందే తెచ్చాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయినా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రాంతాల వారీగా ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…
నైజాం – 22.5 కోట్లు
సీడెడ్ – 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర – 10.05 కోట్లు
గుంటూరు – 7.19 కోట్లు
ఈస్ట్ – 6.22 కోట్లు
వెస్ట్ – 4.54 కోట్లు
కృష్ణ – 5.55 కోట్లు
నెల్లూరు – 2.42 కోట్లు
మొత్తం ఐదు రోజులకు రూ. 68.22 కోట్ల షేర్
Latest News