by సూర్య | Tue, Jan 14, 2020, 05:16 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే 125 రోజుల పడిన కష్టం ఒకే ఒక దెబ్బతో మరచిపోయేలా చేసింది సరిలేరు టాక్. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగను ముందే తెచ్చాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయినా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి రోజే కాదు రెండో రోజు, మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు దద్దరిల్లిపోయాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.47 కోట్లు రాబట్టగా ..రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 63 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేయగా.. ఇక మూడో రోజు 103 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. దిల్ రాజు , అనిల్ సుంకర , మహేష్ బాబులు సంయుక్తం గా నిర్మించిన ఈ మూవీ లో లేడీ అమితాబ్ విజయశాంతి మహేష్కి సమానంగా కీలక పాత్రను పోషించారు. రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , హరితేజ, సంగీత, సహాయ పాత్రలను పోషించారు.
Latest News