by సూర్య | Tue, Jan 14, 2020, 01:20 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. గుంటూరులో మహేష్ సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పరంపర కొనసాగుతుంది. మొదటి రోజు 5.15కోట్ల షేర్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆదివారం తో పాటు నిన్న వర్కింగ్ డే సోమవారం కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సోమవారం ఈ మూవీ 45.92 లక్షల షేర్ సాధించి అబ్బురపరిచింది. ఇక నేటి నుండి పండుగ దినాలు మొదలుకావడంతో వసూళ్ళలో పెరుగుదల నమోదయ్యే ఆస్కారం కలదు. అలాగే ఓవర్సీస్ కూడా సరిలేరు నీకెవ్వరు $2మిలియన్ డాలర్స్ వసూళ్లకు చేరువైంది. టూ మిలియన్ క్లబ్ లో చేరిన మహేష్ మూడవ సినిమాగా సరిలేరు నీకెవ్వరు నిలవనుంది.
Latest News