by సూర్య | Tue, Jan 14, 2020, 12:56 PM
నితిన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు కమిటై ఉన్నారు. వీటిలో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భీష్మ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా భీష్మ చిత్రం తెరకెక్కింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా మహంతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే నితిన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన యూఎస్ కి చెందిన ఎం బి ఏ గ్రాడ్యుయేట్ అయిన శాలినిని పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకోనున్నారని సమాచారం. ఐతే నితిన్ పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయని తెలుస్తున్న తాజా వార్త. నితిన్ నాన్నగారైన సుధాకర్ రెడ్డి దుబాయ్ లో ఓ ప్రముఖ హోటల్ కూడా బుక్ చేశారట. దుబాయ్ లో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏప్రిల్ లో ఈ వివాహం జరగనుందని సమాచారం.
Latest News