by సూర్య | Tue, Jan 14, 2020, 12:49 PM
విఐ అనంద్ దర్శకత్వంలో రవి తేజ హీరోగా రూపొందుతున్నచిత్రం ‘డిస్కో రాజా’. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇకపోతే చిత్ర బృందం ప్రీరిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న హైదరాబాద్ నగరంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఇందులో నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ కథానాయికలుగా నటించారు. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.
Latest News