by సూర్య | Mon, Jan 13, 2020, 07:31 PM
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'డిస్కోరాజా'. ఈ మూవీ టీజర్ 2.O సంక్రాంతి సందర్భంగా విడుదలై దుమ్మురేపుతోంది. చాలాకాలం తర్వాత మాస్ మహారాజా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మూవీగా ఇది తెరకెక్కుతోంది. సైనికులు సంవత్సరాలపాటు బాంబింగ్స్ తో, ఫైరింగ్స్ తో యుద్దాలు చేసి..వేటాడే ఇంట్లో ఉంటే సడెన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడూ అంటూ ప్రారంభమయ్యే సంభాషణలతో టీజర్ విడుదలైంది.రవితేజ టీజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా..బాబీ సింహా చెప్పే డైలాగ్స్ తో సాగే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్డైరెక్టర్. వెన్నెల కిశోర్, సత్య, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. బాబీ సింహా విలన్గా కనిపించనున్నారు. ఈ మూవీ రవితేజకు కీలకం కానుంది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకి హిట్ లేదు.
దీంతో టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.దీంతో గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న రవితేజకి డిస్కోరాజా స్క్రిప్ట్ బాగా నచ్చింది. ఈ నేపధ్యంలో ఓ కొత్త కథతో ఈ మూవీ హిట్ కావాలని రవితేజ తన శక్తినంతా ఉపయోగించాడు. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచేసింది. అందులో భాగంగానే మరో టీజర్ యూట్యూబ్ ని ఊపేస్తోంది. పండుగ తర్వాత విడుదలవుతున్న ఈమూవీ ఎలా వుంటుందో చూడాలి.
Latest News