by సూర్య | Mon, Jan 13, 2020, 05:11 PM
సిని పరిశ్రమపై మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాల్లో రాయలసీమ వారిని ఫ్యాక్షనిస్టులుగా.. ఉత్తరాంధ్ర వాళ్లను కామెడియన్లుగా చూపిస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కవాతు చేయాల్సింది విజయవాడలో కాదని.. రాజధాని భూములు తీసుకుని అభివృద్ధి చేయనందుకు చంద్రబాబు ఇంటి వద్ద కవాతు చేయాలని మంత్రి అవంతి సూచించారు. వెనకబడిన ప్రాంతమైన విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తూంటే చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారని అవంతి విమర్శించారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని మంత్రి అవంతి స్పష్టం చేశారు.
Latest News