by సూర్య | Mon, Jan 13, 2020, 12:16 PM
మెగా స్టార్ చిరంజీవి గారు అంటే చిన్న వారి నుండి సినీస్టార్స్ వరకు అందరికి అభిమానమే. తాజాగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కూడా అలాంటి అభిమానమే చూపించారు. ఆదివారం జరిగిన జీ సినిమా అవార్డుల వేడుక కు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు.
ఈ వేడుకకు వచ్చిన హీరో కార్తికేయ చిరంజీవిని పలకరించారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంధర్భాన్ని ప్రస్తావిస్తూ కార్తికేయ చిత్ర పరిశ్రమలో తన హార్డ్ వర్క్ నిబద్దతతో ఎందరికో దారి చూపిన స్ఫూర్తి దాత చిరంజీవి గారిని కలవడం జీవితంలో మరచిపోలేని రోజు, ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం గీత ఆర్ట్స్ 2 లో ఓ సినిమా చేయబోతున్నాడు.
Latest News