by సూర్య | Sun, Jan 12, 2020, 06:52 PM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో మనువడితో కలిసి మూడు మొక్కలు నాటారు . ఈసందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నా మిత్రులు రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల మన రాష్ట్రం మన దేశం ఆకుపచ్చగా మారబోతోంది. ఈ సందర్భంగా సంతోష్ కు అభినందనలు తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన తరపున మరొక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నానని వారు కూడా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ప్రముఖ హీరో మహేష్ బాబు, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి లను మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.
Latest News