by సూర్య | Sun, Jan 12, 2020, 06:16 PM
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే తాజాగా ఈ సినిమాను వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా బన్నీ, త్రివిక్రమ్ సహా యూనిట్ను అభినందించారు. ``చాలా ఇష్టంగా అద్భుతంగా నటించిన అల్లు అర్జున్, త్రివిక్రమ్గారి బ్రిలియంట్ రైటింగ్ కారణంగా `అల వైకుంఠపురములో` చాలా గొప్పగా రూపొందింది. బావా, సామీలకు కంగ్రాట్స్`` అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జయరాం, టబు, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
An effortless and terrific performance from @alluarjun and brilliant writing from Trivikram Srinivas garu make #AlaVaikuntapurramuloo a great watch. Congrats Bava and Swamy
— Jr NTR (@tarak9999) January 12, 2020
Latest News