‘అల వైకుంఠపురములో’ టీం కి కంగ్రాట్స్‌ చెప్పిన ఎన్టీఆర్

by సూర్య | Sun, Jan 12, 2020, 06:16 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే తాజాగా  ఈ సినిమాను వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా బన్నీ, త్రివిక్రమ్ సహా యూనిట్‌ను అభినందించారు. ``చాలా ఇష్టంగా అద్భుతంగా నటించిన అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌గారి బ్రిలియంట్ రైటింగ్ కారణంగా `అల వైకుంఠపురములో` చాలా గొప్పగా రూపొందింది. బావా, సామీలకు కంగ్రాట్స్‌`` అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్‌. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జయరాం, టబు, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 






 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM