by సూర్య | Sun, Jan 12, 2020, 04:31 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే 125 రోజుల పడిన కష్టం ఒకే ఒక దెబ్బతో మరచిపోయేలా చేసింది సరిలేరు టాక్. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగను ముందే తెచ్చాడు. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీతో సరిలేరు నీకెవ్వరు అంటూ నిన్న థియేటర్లలోకి దిగిన మహేష్ వసూళ్ల సునామి సృష్టించారు. మొదటి షో నుండే హిట్ టాక్ తో నడిచిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తాజాగా అందిన లెక్కల ప్రక్రారం సరిలేరు నీకెవ్వరు ఆంధ్ర తెలంగాణా లో మొదటిరోజు 33.52 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇవి మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ కావడం గమనార్హం. అలాగే టాలీవుడ్ ఆల్ టైం టాప్ ఫోర్త్ హైయెస్ట్ షేర్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. నైజాంలో మొదటిరోజు 8.66 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఆంధ్రాలో ప్రధాన ఏరియాలలో రికార్డ్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక సరిలేరు నీకెవ్వరు ప్రదర్శించబడుతున్న అన్ని థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.
Latest News