by సూర్య | Sun, Jan 12, 2020, 01:50 PM
బద్రి వెంకటేష్ దర్శకత్వంలో 'నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా' చిత్రంతో కోలీవుడ్కి పరిచయమైన యువనటుడు రియోరాజ్, మలయాళ భామ రమ్య నంబీశన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ఏదైనా పని చేస్తే పథకం ప్రకారం చేయాలని పెద్దలు చెబుతుంటారు. అదే అర్ధంతో 'ప్లాన్ పన్ని పన్ననుమ్' అనే టైటిల్ పెట్టారు. పాజిటివ్ ప్రింట్ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రి వెంకటేష్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చాడు. షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న తరుణంలో.. సింగపూర్లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో 'ప్లాన్ పన్ని పన్ననుమ్' టైటిల్ను విడుదల చేశారు.
Latest News