by సూర్య | Sun, Jan 12, 2020, 12:57 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే 125 రోజుల పడిన కష్టం ఒకే ఒక దెబ్బతో మరచిపోయేలా చేసింది సరిలేరు టాక్. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగను ముందే తెచ్చాడు అనిల్ రావిపూడి. మహేష్ నుండి అభిమానులు ఏం కోరుకున్నారో దానిని పక్కాగా చూపించి అసలైన బ్లాక్ బస్టర్ బొమ్మ ను ఇచ్చాడు. దీంతో అన్ని ఏరియాల్లో కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ కలెక్షన్స్
ఈస్ట్ గోదావరి - 3. 35 కోట్లు
వెస్ట్ గోదావరి - 2.72 కోట్లు
సీడెడ్ - 4.15 కోట్లు
వైజాగ్ - 4.04 కోట్లు
Latest News