by సూర్య | Sun, Jan 12, 2020, 12:32 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు అదిరిపోయే రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ తీసుకుంది.మహేష్ సరిలేరు నీకెవ్వరు నిన్న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ మరియు ఎనర్జిటిక్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా ఐపోయారు. దర్శకుడు అనిల్ టేకింగ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. కాగా నైజాంలో మొదటిరోజు సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో 8.66 కోట్ల షేర్ రాబట్టింది. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్ గా నిలిచింది. నైజాంలో ప్రభాస్ సాహో మొదటి స్థానంలో కొనసాగుతుండగా… బాహుబలి 2, సైరా తరువాత స్థానాల్లో ఉన్నాయి. అతిపెద్ద సినిమా సీజన్ గా భావించే సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు రానున్న రోజులలో మరిన్ని మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం కలదు.
Latest News