by సూర్య | Sun, Jan 12, 2020, 12:15 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అదిరిపోయే రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ తీసుకుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు గుంటూరు నందు రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 5.14 కోట్ల షేర్ తో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గుంటూరులో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గా ఉన్న సైరా చిత్రాన్ని సరిలేరు నీకెవ్వరు దాటివేసింది. సైరా మొదటిరోజు గుంటూరు లో 5.06 కోట్ల వసూళ్లు అందుకుంది. బాహుబలి 2 మాత్రమే 6.18 కోట్ల కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఉంది. ఇక కృష్ణ డిస్ట్రిక్ట్ లో ఆల్ టైం టాప్ గా నిలిచింది. అక్కడ 3.07 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో సైరా పేరిట 3.02 కోట్లతో ఉన్న రికార్డు ని సరిలేరు నీకెవ్వరు సొంతం చేసుకుంది.
Latest News