by సూర్య | Sat, Jan 11, 2020, 07:58 PM
మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ వేరే చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలా కోసం ఎదురుచూసే అభిమానులెందరో. చిరుతో ఎంతో సన్నిహితంగా ఉండే అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఏపీ రాజధాని అంశంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరుపై మండిపడ్డారు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్, కమెడియన్ పృథ్వీపై కూడా ఆయన విమర్శలు చేశారు. మూడు రాజధానులపై మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఏ అనుభవంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని అన్నారు. మూడు రాజధానులు చిరంజీవికి ఎందుకు నచ్చాయోనని ఎద్దేవా చేశారు. మహేష్ ఇంటిముందు రైతులు ఆందోళన చేసిన పట్టించుకోలేదు. సగటు మనిషిగానైనా మహేష్ స్పందించవచ్చు కదా అన్నారు.
Latest News