by సూర్య | Sat, Jan 11, 2020, 05:51 PM
మహేష్ తదుపరి సినిమా మూడు నెలలు ఆగి మొదలెడతాడట. అది కూడా 'మహర్షి' డైరెక్టర్ వంశి పైడిపల్లితో.. మహర్షి సినిమా తర్వాత మహేష్ కోసం ఎదురు చూస్తున్న వంశీ పైడిపల్లి మహేష్ తోనే సినిమాకి సిద్దమయ్యాడు. మహేష్ తో సుకుమర్ సినిమాని మహేష్ కావాలనే ఆపేసాడు. తర్వాత సందీప్ వంగా తో అన్నారు..అది చడీ చప్పుడు లేదు. మహేష్ కూడా స్పందించకపోవడంతో అదీ లేనట్లే. ఇక గీత గోవిందం దర్శకుడు పరశురామ్ మహేష్ తో సినిమా అంటున్నాడు. మహేష్ మాత్రం పరశురాంతో సినిమాపై ఎక్కడా మాట్లాడలేదు. మరోపక్క మహేష్ బాబు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని మీట్ అయ్యాయని.. ఆ మీటింగ్ కి అర్ధం సినిమా ఉంటుంది అని కాదని.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండొచ్చు.. ఉండకపోవొచ్చు అంటున్నాడు. మరి సందీప్ వంగ, పరశురామ్, సుక్కు, ప్రశాంత్ నీల్ ఇలా అందరిని పక్కనబెట్టి కూల్ అంటూ మూడు నెలలు గ్యాప్ తీసుకుని మహర్షి డైరెక్టర్ వంశి తో కొత్త సినిమా చేయనున్నాడు మహేష్. అంతేకాని.. మరో కమిట్మెంట్ లేదని తేల్చేసాడు.
Latest News