by సూర్య | Sat, Jan 11, 2020, 01:45 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` చిత్రంలో కంగన నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని దక్షిణాది చిత్రాల్లో కూడా నటించేందుకు కంగన ఆసక్తిగా ఉంది. కంగన నటించిన తాజా చిత్రం `పంగా`. ఈ సినిమాలో కంగనది జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. మధ్య తరగతి గృహిణిగా, ఓ బిడ్డకు తల్లిగా ఈ చిత్రంలో కంగన కనిపించనుంది. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న కంగన దక్షిణాది చిత్రాల గురించి మాట్లాడింది. `గతంలో `మణికర్ణిక`, ఇప్పుడు జయలలిత బయోపిక్ `తలైవి`.. హైదరాబాద్, చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నా. పూర్తి సౌతిండియన్గా మారిపోయా. ఇక్కడి కల్చర్ నాకు బాగా నచ్చింది. దక్షిణాదిలో ప్రస్తుతం గొప్ప సినిమాలొస్తున్నాయి. మంచి అవకాశాలు వస్తే దక్షిణాది చిత్రాల్లో నటించడానికి నేను సిద్ధమేన`ని కంగన చెప్పింది.
Latest News