by సూర్య | Sat, Jan 11, 2020, 12:56 PM
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ 9వ తేదీన విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో రజిని మేనియా తగ్గలేదని దర్బార్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. చాలాకాలం తర్వాత పోలీస్ గెటప్లో కనిసిస్తుండటం, మురగదాస్ దర్శకత్వం వహిస్తుండటం, టీజర్, ట్రైలర్, పాటలు ఓ రెంజ్లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ భారీ అంచానల నడుమ విడుదలై ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఏకంగా రూ. 36 కోట్ల వరకు వసూలు చేసింది. కేవలం తమిళనాటనే దాదాపు రూ. 19 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందంటే కోలీవుడ్లో రజనీ స్టామినా ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్, ఓవర్సీస్లోనూ రజనీకి మంచి పట్టు ఉండటంతో అక్కడ కూడా 'దర్బార్'భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే 'దర్బార్' రూ. 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్లో తానాజీ, ఛపాక్ చిత్రాలు విడుదలైనప్పటికీ 'దర్బార్'జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. ఆ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది. అదేవిధంగా శుక్రవారం తెలుగులో మరే సినిమా లేకపోవడం దర్బార్కు మరింత కలిసొచ్చింది. రెండో రోజు కూడా దాదాపు రూ. 50 కోట్ల పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓవరాల్గా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రజనీ దర్బార్ రూ. 100 కోట్ల మార్క్ దాటిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ 'రజనీ దర్బార్'బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయబోతోందని అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Latest News