by సూర్య | Sat, Jan 11, 2020, 12:43 PM
మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమా వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటివరకూ 34 కోట్లకు పైగానే ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇక ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ 17 కోట్లకు జరిగింది. అంటే సగానికి సగం పైగానే ఈ సినిమా లాభాలను సాధించింది. మొత్తానికి తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో సాయి తేజ్ కి ప్రతిరోజూ పండగే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. పైగా ఈ హీరోకు తన కెరీర్ లోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించడం విశేషం. మెయిన్ గా సాయి తేజ్ ఈ సినిమాతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.
Latest News