నైజాంలో కలెక్షన్స్ పై ‘సరిలేరు నీకెవ్వరు’ టార్గెట్ పెద్దదే!

by సూర్య | Sat, Jan 11, 2020, 12:38 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  నేడు విడుదలైంది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే మహేష్ బాబుకు వసూళ్ల పరంగా బలమున్న రీజియన్లలో నైజాం కూడా ఒకటి. మహేష్ ప్రతి సినిమాకు నైజాంలో భారీ ఓపెనింగ్స్ నమోదవుతుంటాయి. అయితే ఈసారి ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పితే చూడాలని అయన అభిమానులు ఆశపడుతున్నారు. ఒక్కసారి నైజాంలో టాప్ షేర్స్ నమోదు చేసిన చిత్రాల జాబితా చూస్తే మహేష్ ముందున్న రికార్డ్ పెద్దదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ రూ.9.41 కోట్లతో ‘సాహో’ మొదటి స్థానంలో ఉండగా, రూ.8.10 కోట్లతో ‘సైరా’ రెండో స్థానంలో ‘బాహుబలి-2’ రూ.8.9 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. అలాగే మహేష్ గత చిత్రం ‘మహర్షి’ రూ.6.38 కోట్లతో నాలుగవ స్థానంలో ఉంది. మరి భారీ స్థాయిలో విడుదలవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ నాలుగింటిలో ఎన్నింటిని డామినేట్ చేస్తుందో చూడాలి. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM