by సూర్య | Fri, Jan 10, 2020, 07:25 PM
రజినీకాంత్ సినిమాల్లో బాలీవుడ్ హీరోని విలన్ గా అక్షయ్ కుమార్ ను రోబో 2.ఓ సినిమా కోసం దర్శకుడు శంకర్ తీసుకొచ్చాడు. అయితే అక్షయ్ కూడా భారీ పారితోషకాన్ని తీసుకోని 2.ఓ సినిమాలో పక్షి రాజాగా చేసాడు. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ సినిమా డిజాస్టర్ అయ్యింది. దానితో సినిమాకే హైలెట్ గా నిలిచిన పక్షిరాజా పాత్ర పేరులో లేకుండా పోయింది. మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి.. రజినీకాంత్ దర్బార్ సినిమాలో విలన్ రోల్ లో నటించాడు. సునీల్ శెట్టి అంటే రజినీకాంత్ కి విలన్ గా మంచి పవర్ ఫుల్ రోల్ చేసాడేమో అనిపించింది దర్బార్ ట్రైలర్ చూసాక. కానీ సినిమాలో సునీల్ శెట్టి పాత్ర విలన్ గా తేలిపోయింది. రజినీకాంత్ కి సమ ఉజ్జిగా నిలవాల్సిన సునీల్ శెట్టి పాత్రను మురుగదాస్ సీరియస్ గా తీసుకోలేదు. పాత్ర లాగే సునీల్ శెట్టి నటన కూడా సాధారణం అన్న రేంజ్ లో ఉంది. పేరుకి పెద్ద డాన్ కానీ.. ఆ ప్రభావం రెండు మూడు సీన్స్ కే పరిమితమవడంతో.. రజినీకాంత్ సినిమా గనక మొహమాటానికి సునీల్ ఈ సినిమా ఒప్పుకున్నాడేమో అనిపిస్తుంది
Latest News