తెలుగు రాష్ట్రాలలో రజినీ 'దర్బార్' కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 10, 2020, 06:36 PM

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ నిన్న విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో రజిని మేనియా తగ్గలేదని దర్బార్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. జనరేషన్స్ మరీనా ఎవర్ గ్రీన్ హీరో అనిపిస్తున్నాడు. నిన్న తెలుగుతో పాటు ప్రధాన భాషలలో విడుదలైన దర్బార్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ఈ చిత్రం చెప్పుకోడదగ్గ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 7.5 కోట్ల గ్రాస్ మరియు 4.5 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణా వరకే ఈ చిత్రం 2.27 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఇక ఇవాళ మరియు పండుగ దినాలలో వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు. ఓవర్ సీస్ లో కూడా దర్బార్ రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకెళుతుంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM