by సూర్య | Fri, Jan 10, 2020, 06:08 PM
మహేష్ బాబు మ్యానియాతో రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటకే బుకింగ్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. అయితే ఈ సారి మహేష్ మ్యానియా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ కి అడ్డాగా వున్న కేరళలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కేరళ లో రిలీజ్ అవుతోంది. కేవలం కేరళ లోనే దాదాపు 30 సెంటర్లలలో ఓ తెలుగు సినిమా రిలీజవ్వడం రికార్డు గా చెపుతున్నారు. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా కానీ.. ఏ స్టార్ హీరో సినిమా కానీ ఇన్ని సెంటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సినిమాతో కేరళలో కూడా కొత్త రికార్డులు అందుకోవాలని మహేష్ ఉర్రూతలూగుతున్నాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. థియేటర్ల ముందు పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్స్ లు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సారి ఆశించిన దానికంటే మార్కెట్ ఎక్కువగానే జరిగే అవకాశముందని ట్రేడ్ పండితులు చెపుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాపై హైప్ తో తొలిరోజే దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. ఈ దూకుడు చూస్తుంటే మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఖాయమనేది అర్థమవుతుంది.
Latest News