by సూర్య | Fri, Jan 10, 2020, 05:19 PM
దర్శకుడు అజయ్ భూపతి తరువాతి చిత్రానికి సిద్ధమవుతున్నారు. 'మహా సముద్రం' పేరుతో అజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్గా సమంత ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ను విన్న సమంత వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ఆమెను బాగా మెప్పించినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు హీరోయిన్గా సమంత ఓకే చెప్పినట్లు వార్తలు వస్తుండటంతో.. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న రెండో చిత్రం 'మహా సముద్రం' అవ్వనుంది. శర్వానంద్, సమంత ఇద్దరు '96' రీమేక్ 'జాను'లో నటించారు. ఈ సినిమాను ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
Latest News