మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ డే టార్గెట్ ఎంతంటే?

by సూర్య | Fri, Jan 10, 2020, 03:48 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’ రేపు విడుదల కానుది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఈ చిత్రాన్ని 75 శాతం వరకు తీసేసి మహేష్ సినిమాను రీ ప్లేస్ చేస్తున్నారు బయ్యర్లు. దాదాపు 2000 స్క్రీన్స్‌‌లో విడుదల కానుంది ఈ చిత్రం. మహేష్ బాబు టార్గెట్ కూడా భారీగానే ఉంది. ఈ చిత్రం 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 110 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ ఈ చిత్రం హిట్ అనిపించుకోదు. తొలిరోజే దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేయాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. ఈ చిత్రంపై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు మహేష్. ఈ దూకుడు చూస్తుంటే మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయమనేది అర్థమవుతుంది. ప్రీ రిలీజ్ టాక్ కూడా పాజిటివ్‌గానే ఉండటంతో దర్శక నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM