by సూర్య | Fri, Jan 10, 2020, 02:28 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ రేపు విడుదల కానుది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ' లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా కేరళలో కొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. అదేంటంటే.. ఈ సినిమా తెలుగు వెర్షన్ను 30 థియేటర్స్లో విడుదల చేస్తున్నారట. ఓ తెలుగు సినిమా ఇన్ని థియేటర్స్లో విడుదల కావడం ఇదే ప్రథమం.
Latest News