‘దర్బార్’ సినిమాకు పైరసీ భూతం పట్టుకుంది!

by సూర్య | Fri, Jan 10, 2020, 01:46 PM

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ మూవీలో రజిని పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ రజని యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ నిన్న విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. ఇంతవరకు బాగానే ఉండగా సినిమాను పైరసీ భూతం పట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సినిమా విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ప్రముఖ పైరసీ వెబ్ సైట్లో సినిమా దర్శనమిచ్చింది. చిత్రాన్ని వీక్షించడమే కాదు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వీలు కూడా అందించింది ఆ పైరసీ సైట్. ఇప్పటికే వేల సంఖ్యలో డౌన్ లోడ్స్ జరిగిపోయాయి. సోషల్ మీడియాలో సినిమా క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు అభిమానులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా చిత్రాన్ని పైరసీ సైట్ల నుండి తొలగించాలని సైబర్ పోలీసుల్ని కోరుతున్నారు.

Latest News
 
ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:28 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM