by సూర్య | Fri, Jan 10, 2020, 01:29 PM
కళ్యాణ్ రామ్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎంత మంచివాడవురా’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుధవారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తాతకు తగిన మనవడిగా ఎన్టీఆర్ కి మంచి పేరుంది. అంతేకాకుండా మాస్ హీరోగా మంచి ఇమేజ్ కూడా వుంది. దీంతో ఎన్టీఆర్ ని చూడడానికి భారీగా నందమూరి అభిమానులు తరలివచ్చారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ బలంగానే కోరుకుంటున్నారని గత రాత్రి జరిగిన ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ సందర్భంగా బయటపడింది. తారక్ మైక్ తీసుకొని స్టేజ్ మీదకు రాగానే ఫాన్స్ అందరూ ఒక్కసారిగా సీఎం..సీఎం అంటూ భారీగా నినాదాలు చేస్తూ స్టేజీ దగ్గరకు బారికేట్లను దాటుకుంటూ దూసుకుని వెళ్లారు. వీరిని కంట్రోల్ చేయడం అక్కడ వున్న పోలీసుల వలన కూడా కాలేదు. ఎన్టీఆర్ మైక్ తీసుకున్నా.. ఫ్యాన్స్ నినాదాలు చేయడం మానలేదు. సీఎం సీఎం అంటూ రచ్చ రచ్చ చేశారు. చివరికి ఎన్టీఆర్ తీవ్ర అసహనంతో ‘మీరు సైలెంట్గా లేకపోతే నేను మాట్లాడకుండానే వెళిపోతా’ అని హెచ్చరించడంతో కాస్త సైలెంట్ అయ్యారు. చూడాలి మరి ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాలవైపు యూటర్న్ తీసుకుంటారో లేక వెండితెరకే పరిమితం అవుతారో!
Latest News