by సూర్య | Fri, Jan 10, 2020, 12:41 PM
చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి వంటి స్టార్ హీరోలతో పాటు ఐశ్వర్య రాయ్ కీర్తి సురేష్ కూడా పొన్నియిన్ సెల్వం చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మరియు మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ కి చెందిన మోహన్ బాబు పొన్నియిన్ సెల్వన్ చిత్రం ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. రెండు భాగాలుగా ఈ పీరియాడిక్ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మణి రత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియడ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లో చిత్రీకరించారు. షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ చెన్నై చేరుకుందని సమాచారం. కల్కి కృష్ణ మూర్తి రాసిన పీరియాడిక్ స్టోరీ పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ స్టార్ క్యాస్టింగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలలో విడుదల చేయనున్నారు.
Latest News